సౌందర్య లహరి 4
- murthydeviv
- Dec 23, 2024
- 1 min read
జగజ్జనని అయిన శ్రీదేవి తనను ఉపాసించే భక్తులను తన కన్న బిడ్డల వలే ఆదరించి భుక్తి ముక్తి లను తప్పక
ప్రసాదిస్తుంది. అందు వలన మనం అందరమూ మన శక్తి నీ అనుసరించి పరా శక్తి, అయిన శ్రీ రాజరజేశ్వరీదేవి,
లలితా త్రిపుర సుందరి,శ్రీ మహా త్రిపుర సుందరీ అనే నామాలతో విరాజిల్లే శ్రీదేవీ నీ ఉపాసించి ఆమె అనుగ్రహంతో
అమృత ధామం అయిన మోక్షాన్ని పొందుతారు.ఈ సౌందర్య లహరి కి ఎన్నొ వ్యాఖ్య నాలు వున్నా శ్రీ రామకృష్ణ మఠం
వాళ్ళ పుస్తకము మనకు తేలికగా అర్థము అవుతుంది. పారాయణ కు అనువుగా ఉంటుంది. నవరాత్రులలో ఇంకా పర్వ దినాలలో పారాయణ చేసికోవచ్చు. నాకు గురువుగారు చెప్పిన కొన్ని శ్లోకముల నంబర్ లను ఇస్తున్నాను.,
1 ,5,8,11,22,26,27,28,32,33, 36.44,46, 48,55. 56,57,. అన్ని శ్లోకములు మహిమ గలవే అయితే రోజూ అన్నీ పారాయణ చేయ లేము కాబట్టి ముఖ్యముగా కొన్ని పారాయణ చెసికోవచ్చు. నేను చదివిన పుస్తకం లో నాకు
ఆర్ధమైన వరకు శ్రీ మాత అనుగ్రహముతో మీతో పంచు కొనే అవకాశము లభించి నందులకు ఆ త్రిపుర సుందరి కి
శతకోటివందనాలు. రేపు సప్త శతి గురించి తెలుసు కుందాము.
Comments