పంచ దశా క్ష రి మంత్రం
- murthydeviv
- Dec 20, 2024
- 1 min read
ఈ మంత్రం గురించి నాకు తెలిసింది చాలా తక్కువ అయితే ఎందుకు వ్రాయటం అనుకుంటారేమో . మననం చేయునదే మంత్రము. మనం మామూలుగా రామా అనో కృష్ణా అనో అనుకుంటాము. భయము కలిగితే ఆంజనేయుడి నీ తలచుకుంటాము. అది మనకు చిన్నప్పటినుండి వున్న అలవాటు. ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వరకూ అందరూ ఈ మంత్ర జపము జోలికి వెళ్ళే వారు కాదు. కానీ ఇపుడు ఎంతమంది గురువులు. టీవీ లో. బయట పూజలు ఉపన్యాసాలు. భక్తి, కూడా ఒక వ్యాపారము లాగా అయిపోయింది.. ఈ మంత్రాలని ఇపుడు చాలా పుస్తకాలలో కూడా చూస్తున్నాము. శ్రీదేవీ మంత్రమైన ఈ పవిత్రమైన మంత్రము శివ శక్తి స్వరూపా ల ప్రతీక. పంచ దశీ మంత్రము నుండే. శ్రీచక్రము ఉద్భవించి నది అని శ్రీ భాస్కర రాయలు తెలిపారు. ఈ మంత్రము కేవలము గురుముఖంగా నే తీసుకోవాలి చాలా నియమ నిష్ఠలతో
జపము చేయాలి . మనకు ఈ మంత్ర జపము యొక్క ఫలితం కావాలనుకుంటే త్రిశతి నామాలు శ్రద్ద గా పఠిస్తే అమ్మ వారి కరుణ మనకు కలుగుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక గురువు గారు ఈ రోజుల్లో మంత్రం యొక్క మహిమ ను గ్రహించ కుండా ఎలా బహిరంగంగా చెప్తున్నారు అని ఆవేదన చెందారు. అందువలన ఇదంతా రాయాల్సి వచ్చింది .
సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా ఎన్నో ఉపన్యాసాలలో ఈ విషయం గురించి చెప్పారు లలిత త్రిపుర సుందరి కరుణ మనకు లభించాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః
コメント